AP మత్స్య కారులకు గుడ్ న్యూస్ ఖాతాలలో 11,500/-రూ చొప్పున 6 నెలలకు 69,000/-రూ ఒకేసారి జమ

AP ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు శుభవార్త చెప్పారు. వారి జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా మరో అడుగు ముందుకు వేస్తున్నారు. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు మరింత మేలు చేసేందుకు AP ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

AP మత్స్యకారులకు డబ్బులు విడుదల:

ఇందులో భాగంగా మరో మూడు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. తిరుపతి జిల్లా రాయదరువు వద్ద గల మాంబట్టు ఎస్ఈజెడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వద్ద నుంచే పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఓఎనీసీ, జీఎస్పీసీ సంస్థల పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాది కోల్పోయిన వారికి నాలుగో విడతగా ఒక్కొక్కరికి రూ.11,500 చొప్పున.. ఆరు నెలలకు గాను అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రూ.69 వేల చొప్పున రూ.161.86 కోట్ల సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి మొత్తం ఓఎనీసీ పైపులైన్ నిర్మాణం వల్ల ఉపాధి కోల్పోయిన 23,458 మందికి రూ.485.58 కోట్ల పరిహారం చెల్లించినట్టవుతుంది. మొత్తం 40,012 మంది జీవనోపాధి కోల్పోగా.. జీఎస్పీసీ పైపులైన్ వల్ల ఉపాధి దెబ్బతిన్న 16,554 మందికి రూ.78.22 కోట్ల సాయాన్ని ఇప్పటికే చెల్లించారు. అదే విధంగా ఓఎన్బీసీ పైపులైన్ వల్ల ఉపాధి కోల్పోయిన 23,458 మందికి ఇప్పటికే మూడు విడతల్లో రూ.323.72 కోట్ల పరిహారాన్ని జమ చేశారు.

మీకు డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకునేందుకు ఈ క్రింది ఉన్న లింక్ క్లిక్ చేయండి: Click here

AP matsyakara
AP matsyakara bharosa

తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు దగ్గర రూ.23.93 కోట్లతో నిర్మించతలపెట్టిన ఫిష్ల్యాం డింగ్ సెంటర్(ఎఫ్ఎల్సీ)కు AP ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఈ సెంటర్ ఏర్పాటుతో ఒకేసారి సురక్షితంగా 500 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలుపుకొనే అవకాశం ఏర్పడుతుంది. దెబ్బతిన్న బోట్లకు ఫిష్ ల్యాండ్ సెంటర్ వద్ద మరమ్మతులు చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. తద్వారా 20 వేల మత్స్యకార కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. ఈ సెంటర్ కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.

పులికాట్ సరస్సుకు సంబంధించి.. AP పరిధిలో 400 చదరపు కిలో మీటర్లు, తమిళనాడు వైపు మరో 61 చదరపు కిలోమీటర్ల మేర ఈ సరస్సు విస్తరించి ఉంది. మూసుకు పోయిన సరస్సు ముఖ ద్వారం పునరుద్ధరణ పనులను రూ.94.75 కోట్లతో శ్రీకారం చుడుతున్నారు. తద్వారా 20 వేలకు పైగా మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. అంతే కాదు మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా 2,18,153 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.4,485.98 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. మరో వైపు వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరిచి వలస వెళ్లే ప్రక్రియను అరికట్టే లక్ష్యంతో రూ.3,793 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను నిర్మిస్తోంది. రూ.11 వేల కోట్లతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు AP ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు.

మీకు డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకునేందుకు ఈ క్రింది ఉన్న లింక్ క్లిక్ చేయండి: Click Here

AP matsyakara
matsyakara bharosa
Verified by MonsterInsights