AP CM చంద్రబాబు నాయుడు అమలు చేయబోయే కొత్త పథకాలు ఇవే; AP New Scheme 2024

AP రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోని సూపర్ సిక్స్ అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ మరియు ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ కూటమి భారీ విజయం సాధించింది. కాబట్టి ఎన్నికలకు ముందుగా ఇచ్చినటువంటి హామీ మేరకు ఉమ్మడి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

AP లో సూపర్ సిక్స్ అనే పేరుతో పథకాలను అమలు చేయబోతున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం:

  • యువతకు 20 లక్షల ఉద్యోగాలు / నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే డిగ్రీ ఆపైన చదివినటువంటి విద్యార్థులు నిరుద్యోగ యువత ఉన్నారో అటువంటి వారందరికీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ap సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఉద్యోగాలు రానటువంటి వారికి డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి వారందరికీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలలో వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇచ్చి వారికి ప్రతి నెల ₹10,000 రూపాయల గౌరవ వేతనాన్ని అందిస్తూ వారి యొక్క స్కిల్ డెవలప్మెంట్ ని పెంచి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేవరకు ఈ వాలంటీర్ల జాబులు కొనసాగే అవకాశాన్ని ఇస్తామని నారా చంద్రబాబునాయుడు గారు తెలిపారు.
    అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగాలు లేని నిరుద్యోగ యువత ఎవరైతే డిగ్రీ ఆ పైన చదివినటువంటివారు ఉంటారు అటువంటి వారందరికీ మన యొక్క ఉమ్మడి ప్రభుత్వం అయినటువంటి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ₹3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ప్రతినెలా అయిదు సంవత్సరాల పాటు పంపిణీ చేస్తామని ప్రకటించారు.
  • స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000
    అమ్మకు వందనం పేరుతో AP రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు సమస్తరానికి 15 వేల రూపాయలు చొప్పున నేరుగా వాళ్ల యొక్క తల్లి ఖాతాలోకి జామ చేస్తామని ఎన్నికల హామీలు భాగంగా AP రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబునాయుడు గారు ప్రకటించారు. ఇందులో ఒకే కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నా సరే అందరి పిల్లలకు సంబంధించిన అమ్మకు వందనం అనే పథకం ద్వారా ఒక్కో తల్లికి 15 వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15 వేల రూపాయలను తల్లి ఖాతాలోకి జమ చేస్తారు.
AP schemes
  • ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం:- అన్నదాత సుఖీభవ అనే పథకం కింద ప్రతి రైతుకి సంవత్సరానికి విడతల వారీగా విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 6000 ఈ 6000 ఒకేసారి కాకుండా కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా జమ చేస్తూ వస్తుంది. కింద ప్రభుత్వం మూడు వాయిదాల పద్ధతిలో ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రైతులకు విడుదల చేస్తుంది. ఒక్కో విడతలు 2000 రూపాయల చొప్పున ప్రతి రైతుకి డిబిటి పద్ధతులు విడుదల చేస్తుంది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి 14000 రూపాయలను రెండు విడతల్లో ఒకే విడతలు 7000 రూపాయలు చొప్పున నేరుగా రైతులు ఖాతాలోకి విడుదల చేస్తుంది. ఇందులో కౌలు రైతులకు కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది.

రైతుల ఖాతాలో PM KISAN నిధులు విడుదల వెంటనే చెక్ చేసుకోండి :- Click here

  • ప్రతి మహిళకి నెలకు రూ. 1500 (19 సం॥ నుంచి 59 సం॥ వరకు):- ప్రతి నెల 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వరకు వయసు కలిగిన మహిళలకు ప్రతినెలా 1500 రూపాయలు చొప్పున నేరుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హులను అర్హులను గుర్తించి వారికి పంపిణీ చేయబోతుంది. ఈ పథకానికి మహాలక్ష్మి అనే పేరు పెడతారని సమాచారం. ఈ పథకం అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కూడా ఉండాలి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లోకి ఉండాలి ఈ మూడు డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నట్లయితే పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే అప్లై చేసుకుని డబ్బులు పొందవచ్చు.
  • ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు:- ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తుంది. ఈ మూడు సిలిండర్లు ఒకేసారి కాకుండా ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ఒక్కో సిలిండర్ చొప్పున సంస్కారంలో మూడు సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఏ గ్యాస్ సిలిండర్లకు మొదటగా మనం పూర్తి డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకోవాలి తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అమౌంట్ తో కలిపి మనం సిలిండర్ కోసం ఎంత డబ్బులు పెట్టామో ఆ డబ్బులు అంతటిని తిరిగి మన ఖాతాల్లోకి వేస్తుంది. మీరు ఏ కంపెనీకి సంబంధించిన గ్యాస్ సిలిండర్ వాడుతున్న సరే ఈ పథకాన్ని ఈజీగా తీసుకోవచ్చు. ఈ పథకంలో గ్యాస్ కనెక్షన్ తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు కలిగి ఉండాలి.
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం:– మీ యొక్క పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఊహించని శుభవార్త చెప్పారు ప్రతి మహిళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయాణ సౌకర్యార్థం వాళ్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించనున్నారు. ఈ ఉచిత బస్సు జర్నీ చేయాలంటే ఆధార్ కార్డు కచ్చితంగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో అడ్రస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది ఉండాలి. ఈరోజు ప్రకారంగా మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారు అటువంటి వారందరికీ ఏ ఫ్రీ బస్సు పథకాన్ని అందిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.
  • ఈ పూర్తి సమాచారం కోసం ఈ వెబ్ సైట్ లో చూడండి:- Click here
Verified by MonsterInsights